NRI-NRT

తానా సభలకు “పవర్” వచ్చింది

Power Star Pawan Kalyan And SS Rajamouli Reach DC To Attend TANA 2019 Conference

వాషింగ్టన్ డీసీ వేదికగా నేటి సాయంత్రం నుండి ప్రారంభం కాబోతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు సినీనటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డీసీ చేరుకున్నారు. ఆయంతో పాటు జనసేన సలహాదారుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీరిరువురికీ తానా అధ్యక్షుడు వేమన సతీష్ వర్జీనియాలోని డల్లస్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. బుధవారం సాయంకాలం ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి కూడా తానా సభల్లో పాల్గొనేందుకు డీసీ చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీ నడిబొడ్డున ఉన్న వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో బ్యాంక్వెట్ విందుతో నేటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పలు సంగీత, కళా, సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నాయి. డీసీ చేరుకున్న అతిథుల జాబితాలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుమ్మడి గోపాలకృష్ణ, సినీనటులు అల్లరి నరేష్, శివారెడ్డి, మాజీ మంత్రులు పయ్యావుల, గంటా, నిర్మాత నవీన్ ఎర్నేని తదితరులు ఉన్నారు.