NRI-NRT

బెహ్రెయిన్‌లో దీక్ష దివస్ వేడుక

బెహ్రెయిన్‌లో దీక్ష దివస్ వేడుక

ఆమరణ దీక్షనే అంతిమ అస్త్రంగా నాడు కేసీఆర్ చేసిన త్యాగఫలమే నేటి తెలంగాణ అని టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖ నాయకులు అన్నారు. దీక్షా దివస్‌ చేపట్టి 13 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా బహ్రెయిన్‌లో దీక్షదివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ బహ్రెయిన్‌ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ , ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ దీక్షా దివస్‌ చరిత్రను మలుపు తిప్పిందని పేర్కొన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ఈ కార్యక్రమములో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ ,కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్ ,సంగేపోలు దేవన్న , ఉత్కం కిరణ్ గౌడ్ ,కొత్తూరు సాయన్న ,గరిగె సతీష్ గౌడ్, తోకల లింగం, నాయకులు పాల్గొన్నారు.