Politics

తెలంగాణ కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదాలు

తెలంగాణ కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదాలు

పీసీసీ కొత్త కమిటీలపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. కొత్త టీమ్ లో పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ తన పదవి రాజీనామా చేయగా.. ఇవాళ బెల్లయ్య నాయక్.. పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ఛైర్మన్ గా ఉన్న తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఎందుకు స్థానం ఇవ్వరని బెల్లయ్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ సెక్రెటరీ స్థాయి పోస్ట్ లో ఉన్న తనకు పీసీసీ కమిటీలో లేదంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు ఎందుకు ఇవ్వరని బెల్లయ్య నాయక్ ప్రశ్నిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నేతలపై కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు ఉందని ఆరోపించారు. గతంలోనూ పీఏసీలో కోదండరెడ్డికి, తనకు అవకాశం ఇస్తామని చెప్పి కేవలం ఆయనకే ఆహ్వానం పంపేవారని బెల్లయ్య నాయక్ అన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన బెల్లయ్య నాయక్.. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పంపారు.