DailyDose

TNI నేటి నేర వార్తలు. హైదరాబాదులో రెచ్చిపోతున్న హిజ్రాలు.

TNI నేటి నేర వార్తలు. హైదరాబాదులో రెచ్చిపోతున్న హిజ్రాలు.

|| నగరంలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. వేలల్లో డబ్బుల వసూళ్లు..||

⚪️ హైదరాబాద్

◻️ ఏరియాలుగా పంచుకుని వసూళ్లు….. ❗️

◻️ నకిలీ..ఒరిజినల్ హిజ్రాలు అంటూ గొడవలు..

◻️ రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పదుతున్నారు అంటూ పరస్పరం ఆరోపణలు….

◻️ పోలీస్ స్టేషన్ కు చేరిన
హిజ్రాల గ్రూపు తగాదాలు…..

◻️ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వీరంగం……

◻️ తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలి అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళన..

◻️ పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో పాటు పోలిసుల విధులు అడ్డగించిన హిజ్రాల మీద కింద ipc 353, 306 red with 511 కింద కేసు నమోదు.

◻️ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలకి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు.

అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నఖిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు: డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి
Note: ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది ని అభినందించడం తో పాటు వారికి 25,000 రూపాయల రివార్డ్ ను ప్రకటించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి
ముఖ్యమంత్రి వై‌ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్షంగా ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి IPS* గారి పర్యవేక్షణలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ Dr.ఫక్కీరప్ప కాగినెల్లి IPS అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్పెషల్ ఆపరేషన్ టీమ్స్’ బళ్లారి- అనంతపురం కేంద్రంగా బెంగుళూరుకు చెందిన రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంతకాలంగా కొనసాగిస్తున్న నకిలీ కరెన్సీ నోట్లను(ఎఫ్‌ఐసిఎన్) ముద్రిస్తూ, ఆయుధాలను విక్రాయిస్తున్న అంతరాష్ట్ర ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించి, మొత్తం ఆరుగురు(నలుగురు రౌడీ షీటర్లు, తయారీదారుడు, సరఫరాదారుడి)ని అరెస్టు చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఇప్పటికే నిందితులపైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు గోవాలో కేసులు ఉన్నాయి..

తమ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో భాగంగా బెంగుళూరుకు చెందిన రౌడీ షీటర్లు జంషీద్ @ ఖాన్ @ జీషన్, ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ @ రియాజ్ షేక్ లు మహారాష్ట్రలోని షిర్పూర్ నుండి గంజాయి, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు ఉమర్తి గ్రామం,వార్ల తహసీల్ , బర్వానీ జిల్లా, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ యూనిట్ పైన ‘స్పెషల్ ఆపరేషన్ టీమ్స్’ దాడి జరిపి ఆయుధాల తయారీదారుడు, డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ రాజ్‌పాల్ సింగ్ తోపాటు మరో ఆయుధాల సరఫరాదారుడు సుతార్ ను అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి లో ఒక అధునాతన సెమీ ఆటోమేటిక్ బెరెట్టా తో పాటు 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితులు అక్రమంగా సంపాదించిన తుపాకులను ఉపయోగించి బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలలో, కిరాయి హత్యలు, దోపిడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాము అంతే కాకుండా ఈ కేసులో ఆయుధల వ్యాపారి రాజ్‌పాల్ సింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలకు వందలాది ఆయుధాలను అక్రమంగా సరఫరా చేసిన్నట్లు సమాచారం మేరకు అక్రమ ఆయుధాల వ్యాపారం యొక్క మొత్తం నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలు :
18 ఆయుధాలు,
95 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రి
06 అదనపు మ్యాగజైన్‌లు.

వివరాలు :-
బెరెట్టా, 15 రౌండ్లతో 9ఎమ్ఎమ్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్
15 రౌండ్లతో 9 mm పిస్టల్స్ (03)
63 రౌండ్లతో 0.32 mm పిస్టల్స్ (11)
రివాల్వర్ (01)
02 రౌండ్లతో తపంచ (02)

నిందితులపైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు గోవాలో నమోదైన కేసుల వివరాలు:
జంషీద్ @ ఖాన్ @ జీషన్ , వయస్సు 37 సంవత్సరాలు, s/o ఆలస్యం. షఫివుల్లా , బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం.( బెంగళూరులోని యశ్వంత్‌పూర్ PS లో రౌడీ షీట్, గంజాయి & ఆయుధాల పెడ్లర్ , 22 క్రిమినల్ కేసులు)
ముబారక్, వయస్సు 43 సంవత్సరాలు, s/o ఆలస్యంగా షఫివుల్లా , బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం.( బెంగళూరు, యశ్వంత్‌పూర్ PSలో రౌడీ షీట్, గంజాయి & ఆయుధాల పెడ్లర్ , 12 క్రిమినల్ కేసులు.)
అమీర్ పాషా, వయస్సు 30 సంవత్సరాలు, s/o లేట్ అమ్జాద్ పాషా, బెంగళూరు, కర్ణాటక. ( బెంగళూరులోని మాగాడి పీఎస్‌లో రౌడీషీట్ కలిగి గంజాయి & ఆయుధాల పెడ్లర్‌పై 7 కేసులు ఉన్నాయి )
రియాజ్ అబ్దుల్ షేక్ @ రియాజ్ షేక్ , వయస్సు: 36 సంవత్సరాలు, s/o ఆలస్యం. అబ్దుల్ షేక్ , దక్షిణ గోవా, గోవా-403707, బళ్లారి పట్టణానికి చెందినవారు. కర్ణాటక రాష్ట్రం .( SJ పాల్య PS బెంగళూరు నగరంలో రౌడీ షీట్, గంజాయి & ఆయుధాల పెడ్లర్ , 4 క్రిమినల్ కేసులు).
రాజ్‌పాల్ సింగ్, వయస్సు 30 సంవత్సరాలు S/o ప్రధాన్ సింగ్, ఉమ్మర్తి గ్రామం, వార్ల తాలూక్ , బర్వానీ జిల్లా. మధ్యప్రదేశ్ రాష్ట్రం. (మధ్యప్రదేశ్‌లో 4 ఆయుధ చట్టం కేసుల్లో ఆయుధాల తయారీదారు & డీలర్ ప్రమేయం)
నన్ను సుతార్ ఆదివాసీ , వయస్సు 25 సంవత్సరాలు , S /o సుతార్ ఆదివాసీ , రాజన్ గోవాన్ గ్రామం, వార్లా తాలూక్ , బర్వానీ జిల్లా. మధ్యప్రదేశ్ రాష్ట్రం. (ఆయుధాల సరఫరాదారు).

f0368947-fc90-4ad5-8073-fd0659f1b783
కడప.. మైలవరం/జమ్మలమడుగు..

విషాదం..

భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య

ఇద్దరు పిల్లల్ని మైలవరం కట్టమీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికుల సమాచారం

దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గోవర్ధన్ లు గా పోలీసులు గుర్తింపు

మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న బంధువులు..

లక్ష్మీదేవి మృతదేహం లభ్యం.. గోవర్ధన్ మృతదేహం కోసం వెతుకుతున్న పోలీసులు..

వీరికి ఒక పాప..ఒక బాబు