DailyDose

రియాధ్ లో సంక్రాంతి వేడుకలు

రియాధ్ లో సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాల నెలవు అది మాతృభూమి గానీ విదేశీ గడ్డ కానీ పంటల పండుగకు మినహాయింపు కాదు. ఏ దేశమేగినా ఎందు కాలెడినా పంటల పండుగ పంటల పండుగె.. స్వంత ఊరిలో చేతికు వచ్చిన తాజా పంటలతో దేవుడికి నైవేద్యం పెట్టె ఆవకాశం ఎడారినాట లేకున్నా, కొత్త బియ్యంతో చేసిన అరిసెలు లేదా తాజాగా మొక్కజొన్న గారెలు తినే ఆవకాశం లేకుంటె ఏమి సౌదీ అరేబియాలోని కొన్ని తెలుగు కుటుంబాలు మాత్రం సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తమ్మెదా అంటూ తాజా మొక్కజొన్న కంకెలను కాల్చి సంక్రాంతి అతిథులకు తినిపించి అందర్ని అశ్చర్యానికి గురిచేసారు.
null
రియాధ్ లోని తెలుగు ప్రవాసీ సంఘమైన రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో ఎముకలు కొరికె చలిలో భోగి మంటలకు అదనంగా ప్రత్యెకంగా మొక్కజొన్న కంకులను కాల్చి తినిపించడం ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది. అనేక మంది మొక్కజొన్న కంకులు (కండెలు) తింటూ తమ గ్రామీణ భారతంలో గడిపిన బాల్య మధుర జ్ఞాపకాలను నెమరువేసుకొన్నారు.

అధ్యాత్మిక వాతవారణంలో సౌజన్య భగవద్గీత ప్రవచనాలతో అంకూర్పణ జరిగిన సంక్రాతి సంబరాలను మంటల చుట్టూ కలిసిమెలిసి కోలాటాలతో సంప్రదాయ వస్త్రధారణతో ఉరుకెలెసే ఉత్సాహంతో వేడుకలను మరింత వేడిక్కించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మల్లారం గ్రామానికి చెందిన అజయ దంపతులకు విదేశీ గడ్డపై ఇదే ప్రప్రధమ పండుగ అయినా తాము ప్రవాసంలో ఉన్నట్లుగా మరిచిపోయి స్వదేశంలోనె ఉన్నట్లుగా పండుగను ఆనందోత్సహంగా జరుపుకోన్నారు.
null
రంగు రంగుల ముగ్గులు మగువల ప్రతిభకు అద్దం అని వాకాటి శ్రీదేవి, సింధూ, మని, మను, బిందు గంధవల్లి, నిరూప భూమెని, అనూష స్వర్ణ ఇతర మహిళలతో కలిసి తమ కళ ప్రావీణ్యన్ని ప్రదర్శించడమె కాదు మోత్తం వేడుకల తతంగాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వార నాయకత్వంలో మగవారికి కంటె తామేమి తక్కువ కాదని నిరూపించారు.

సంక్రాంతి ప్రాధాన్యత గూర్చి సురేఖ విశదీకరించారు. రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంఘ ప్రతినిధులు తిరుపతి స్వామి స్వర్ణ, భాస్కర్, మహేంద్ర, నటరాజ్, జవహార్, అనిల్ మర్రి, ఇబ్రహీం శేఖ్, నాగేంద్ర, శేషు బాబు, మురారి, ప్రసాద్ బోడె, శ్రీనివాస్ ముచ్చు, ఆర్.వి.పి.ప్రసాద్, శేఖ్ జిలానీలు వేడుకలకు తమ తోడ్పాటందించారు.

సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ మరియు ఇతర క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సుఖేష్ మరియు గుత్తు ఇండియన్ రెస్టారెంట్, ధన్యశ్రీ స్వర్ణ మరియు రిషిత్ స్వర్ణ, బిందు భాస్కర్ నగదు బహుమతులు, ట్రోఫీ లను అందించగా, పిల్లలకు మరియు పెద్దలకు మెడల్స్ ను నరేంద్ర పెళ్లూరు ప్రధానం చేయగా, క్రీడాకారులను ప్రముఖలు నాగేశ్వరరావు మట్టపర్తి, ఎర్రన్న, వెంకటేశ్వర్లు దండా, ఆదినారాయణ దాసరి, అనిల్ మర్రి, దేవరాజ్, సతీష్ అభినందించినట్లుగా నిర్వహకులు పెర్కోన్నారు.
null