Business

లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. అంతర్జాతీయ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 59,741 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకొని 17,650 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్ఎల్ఎస్ఈ గ్లాస్కెట్, మిర్జా ఇంటర్నేషనల్, రేమాండ్స్, హెచీఎఫ్సీ లైప్ ఇన్స్యూరెన్స్, హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లాభాల్లో ఉండగా.. బ్రెట్కామ్ గ్రూప్, రాజతన్ గ్లోబల్ వైర్, ఎల్డీసీ, ఈకెఐ ఎనర్జీ సర్వీసెస్, హింద్ జింక్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకొని 82.070 వద్ద కొనసాగుతోంది.

ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం రికార్డు స్థాయి లాభాన్ని ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభావం నేపథ్యంలో సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా-పసిఫక్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. జపాన్ సూచీ నిక్కీ 0.37 పెరగ్గా.. ఆస్ట్రేలియా సూచీ ఎస్అండ్ ఏఎస్ఎక్స్ ప్రతికూలంగా ట్రేడవుతోంది. మరోవైపు దక్షిణకొరియా సూచీ కేవో ఎస్బీఐ కూడా 0.5శాతం కుంగింది