DailyDose

ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర…

ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర…

ఇకపై నేరుగా ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సదుపాయం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 7 నుంచి 19 వరకు యాత్ర కొనసాగనుండగా.. ప్రతి రోజు 155 మంది హాజ్కు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనికి గానూ మొత్తం 1813 మంది యాత్రికులకు రూ.80 వేల చొప్పున సాయం అందివ్వనుంది. యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు మదర్సా వద్ద ఏర్పాట్లు చేశారు.