NRI-NRT

నేటి నుండి నాట్స్ 7వ తెలుగు సంబరాలు

నేటి నుండి నాట్స్ 7వ తెలుగు సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 7వ తెలుగు సంబరాలకు సర్వం సిద్ధమైనట్లు వేడుకల సమన్వయకర్త అప్పసాని శ్రీధర్, అధ్యక్షుడు నూతి బాపులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం 26వ తేదీ సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటరులో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అమెరికా-కెనడా దేశాల్లోని ప్రవాస తెలుగువారు భారీ సంఖ్యలో ఎడిసన్ చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమంలో ఎలీజియం బ్యాండ్, శనివారం కార్యక్రమంలో మణిశర్మ, ఆదివారం కార్యక్రమంలో తమన్ సందడి చేయనున్నారు.

* అతిథులు వీరే
అల్లు అరవింద్, చంద్రబోస్, సాయికుమార్, జొన్నవిత్తుల, వై.వీ.ఎస్, మలినేని గోపీచంద్, కొండవీటి జ్యోతిర్మయి, రామజోగయ్య శాస్త్రి, నేహాశెట్టి, అలీ, సమ్యుక్త మీనన్, కోదండరామిరెడ్డి, శివమణి, మీగడ రామలింగస్వామి తదితరులు పాల్గొననున్నారు.

* తొలిసారిగా మహిళ అష్టావధానం
అమెరికాలో తొలిసారిగా నాట్స్ 7వ తెలుగు సంబరాలు వేదికగా మహిళా అష్టావధానం నిర్వహిస్తున్నారు. ఆకెళ్ల బాలభాను తొలిసారిగా నాట్స్ సంబరాల్లో మహిళా అష్టావధానం నిర్వహించనున్నారు.

పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడవచ్చు – https://www.sambaralu.org/program-schedule.html