Sports

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్

ఆసియా కప్‌లో భారత్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. నామమాత్రపు పోరులో భారత్‌పై బంగ్లాదేశ్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లా నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్‌ అయింది. శుభ్‌మన్‌ గిల్‌(121), అక్షర్‌ పటేల్‌(42) పోరాడినా గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రహమాన్‌ 3, మహెది హసన్‌, షకిబ్‌ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. షకిబ్‌ (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో ఠాకూర్‌ మూడు వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.