Politics

అమిత్‌షాను కలుస్తా. కురుక్షేత్రం కావాలంటే యుద్ధం చేస్తా.

అమిత్‌షాను కలుస్తా. కురుక్షేత్రం కావాలంటే యుద్ధం చేస్తా.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీలోని దుర్మార్గపు పాలన గురించి అందరూ ఆలోచించాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏం చేస్తే అది చెల్లదు. మా నేల మీదకు మమ్మల్ని అడుగుపెట్టకుండా అడ్డుకుంటారా? మేం గొడవ కోసం రాలేదు.. యుద్ధం కావాలంటే కురుక్షేత్రం తప్పదు. మాపై తప్పుడు కేసులు, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. ప్రజలు తలుచుకుంటే కొట్టి కొట్టి చంపేస్తారు. మడ అడవులను అడ్డంగా నరికేసి పర్యావరణ విధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రజాస్వామికంగా ఉంటారు కాబట్టే నేను గౌరవిస్తా. అమిత్‌షాను కలిసి ఏపీలోని పరిణామాలను వివరిస్తానని’’ పవన్‌ కల్యాణ్‌ అన్నారు.