NRI-NRT

వీలునామాలపై “తామా” అవగాహనా సదస్సు

వీలునామాలపై “తామా” అవగాహనా సదస్సు

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో అక్టోబర్ 29న స్థానిక షారన్ కమ్యూనిటీ భవనంలో విల్ అండ్ ట్రస్ట్ గ్రాండ్ మేళా నిర్వహించారు. 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో వీలునామాలపై వెంకట్ అడుసుమిల్లి, సాహిల్ విరాని, లక్ష్మి పరిమళ నాటెన్డ్ల, శ్రీధర్ పోటబత్తుల, అబర్నలు అవగాహన కల్పించారు.

తామా అధ్యక్షుడు సాయిరామ్ కారుమంచి వీరిని సభకు పరిచయం చేశారు. ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి తామా ఫ్రీ హెల్త్ క్లినిక్, సెమినార్ల గురించి వివరించారు. ఉపాధ్యక్షుడు సురేష్ బండారు, బోర్డు కార్యదర్శి మధు యార్లగడ్డ, బోర్డు కోశాధికారి శ్రీనివాస్ ఉప్పు, రూపేంద్ర వేములపల్లి, శ్రీనివాస్ రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, శశి దగ్గుల, స్వప్న యార్లగడ్డ, సుజాత దేవరపల్లి, గౌరి కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ, మధులు సహకారం అందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z