ఫ్యామిలీ బస్.. భర్త కండక్టర్, అదే బస్సుకు డ్రైవర్గా భార్య, వీరి కథకు ఫిదా అవ్వాల్సిందే.!!
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అడుగుపెట్టని రంగమంటూ లేదు. ఆటోమొబైల్ పరిశ్రమలోనూ తమ సత్తాను చాటుుతున్నారు మహిళలు.. అయితే బస్సు డ్రైవర్గా మాత్రం పురుషులే పని చేస్తారని మనకు ఇప్పటి వరకూ తెలుసు. కానీ ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ ఓ మహిళ బస్సును డ్రైవ్ చేస్తూ నెట్టింట్లో వైరల్గా మారింది.
*భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో పబ్లిక్ రోడ్లపై వాహనాలు నడపడం కత్తి మీద సాములాంటింది. ట్రాఫిక్ రద్దీ ఒకవైపు అయితే, రద్దీ మరో వైపు. ఫుట్పాత్పై వేలాడుతూ ఉండే ప్రయాణికులు కూడా ఉంటారు. అందుకే సిటీ రోడ్లపై ప్రభుత్వ బస్సులను నడపాలంటే డ్రైవర్లకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. అనుభవం కలిగిన వారికే ఆ పోస్టులు కేటాయిస్తారు.
** ఉత్తరప్రదేశల్లో ఓ మహిళ బస్సు డ్రైవర్గా నియమితులై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఆ మహిళ భర్త అదే బస్సులో బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు. యూపీలోని బులంద్షహర్ ప్రాంతంలో పాపులర్ అయిన ఈ జంట గురించిన పూర్తి సమాచారం ఈ కథనంలో..
**ఢిల్లీ NCR లో రద్దీగా ఉండే రూట్లో ఓ మహిళ బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ మహిళ భర్త కూడా అదే బస్సులో కండక్టర్గా పనిచేస్తున్నాడు. బులంద్షహర్కు చెందిన ఈ మహిళ పేరు వేద్ కుమారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారి కావాలనేది ఆమె చిన్ననాటి కల. కానీ బస్సు డ్రైవర్గా బాధ్యతలు చేపట్టింది. ఆమె ఢిల్లీ NCRలో రద్దీగా ఉండే ఘజియాబాద్-పడౌన్ మార్గంలో బస్సు డ్రైవర్గా పనిచేస్తోంది.
**ఆఫీస్ కార్యకలాపాల కోసం చాలా మంది ప్రజలు ఈ రూట్లోనే వెళ్లడంతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ ఎప్పుడూ రద్దీగా ఉన్నా.. వేద్ కుమారి ధైర్యంగా ఈ మార్గంలో డ్రైవర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె డిపోలో నుంచి బస్సును ప్రారంభించిన తర్వాత కౌశాంబి ప్రాంతం నుంచి బయలుదేరి, ఘజియాబాద్ చేరుకుని, తరువాత బస్సులో పడౌన్ ప్రాంతానికి వెళ్తుంది.
**వేద్ కుమారి పోస్ట్ గ్రాడ్యుయేట్.. ఆమె సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అందుకే, బస్సు డ్రైవర్గా ఉద్యోగం సాధించినప్పటికీ.. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నట్లు సమాచారం. గతంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో వేద్ కుమారి.. ఒక వార్తాపత్రికలో బస్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ను చూసింది. దీంతో ఆమె ఆ పోస్టుకు అప్లై చేసింది. సెలెక్ట్ అయిన అనంతరం వేద్ కుమారి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ద్వారా బస్సు డ్రైవర్గా శిక్షణ పొందింది. ఈ 2021లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత, ఆమె గత ఏప్రిల్ 2022లో కౌశాంబి డిపోలో విధానపరమైన శిక్షణ తీసుకుంది. దీంతో వేద్ కుమారి ప్రస్తుతం ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –