Politics

జనసేనతో అంబటి రాయుడు భేటీ

జనసేనతో అంబటి రాయుడు భేటీ

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్‌పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z