Politics

తెలంగాణ గళం.. బలం.. దళం.. మనమే!

తెలంగాణ గళం.. బలం.. దళం.. మనమే!

పార్లమెంట్‌లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలంటే సార్వత్రిక ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ టీమ్‌కు ఎందుకు ఓటు వేయాలో ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు. 16, 17 లోక్‌సభల్లో భారాస ఎంపీలు మొత్తం 4,754 ప్రశ్నలు అడిగితే.. కాంగ్రెస్ 1,271, భాజపా 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని చెప్పారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేది భారాస ఎంపీలు మాత్రమేనన్నారు. ‘‘నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. బలం.. దళం.. మనమే’’అని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z