Business

RGIA నుండి అయోధ్యకు విమాన సర్వీసులు

RGIA నుండి అయోధ్యకు విమాన సర్వీసులు

శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z