Politics

నన్ను గెలిపించండి. రెండు రోజుల్లో చూపిస్తా!

నన్ను గెలిపించండి. రెండు రోజుల్లో చూపిస్తా!

దొంగలకు మోదీ చౌకీదార్‌గా మారారని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే రెండ్రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని ధ్వజమెత్తారు. మేకిన్‌ ఇండియా అంటున్న మోదీ కనీసం ఉద్యోగాలు కల్పించలేదని రాహుల్ దుయ్యబట్టారు. అంబానీ.. మోదీకి స్నేహితుడు కాబట్టి బ్యాంకుల్లో డబ్బంతా ఆయనకు ఇచ్చాడని ఆరోపించారు. యువకులు వ్యాపారాలు పెట్టాలనుకుంటే.. మొదటి మూడేళ్ల వరకు పర్మిషన్‌ అవసరం లేదని రాహుల్‌ అన్నారు. ‘‘మోదీ పాలనలో శ్రీమంతులదే రాజ్యం. మాల్యా, నీరవ్‌మోదీ, చోక్సీలకే లబ్ధిచేకూర్చారు. మోదీకి సామాన్యుల బాధలు పట్టవు. ఉపాధి హామీ పథకంతో కోట్లాది మందికి పనికల్పించాం. డ్వాక్రా సంఘాలకు వడ్దీలేని రుణాలు ఇచ్చాం. మోదీ సామాన్యులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. భారత్‌ని మోదీ రెండు భాగాలు చేశారు.. ఒకటి శ్రీమంతుల భారత్‌.. రెండోది పేదల భారత్. న్యాయ్‌ పథకాన్ని తీసుకొస్తున్నాం. నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు ఉన్నారు. నిరుపేదలకు ఏడాదికి రూ.72 వేలు బ్యాంకుల్లో వేస్తాం. పేదరికంపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తాం’’ అని రాహుల్‌గాంధీ చెప్పారు.