Politics

తండ్రికి తీసిపోని కొడుకు జగన్

తండ్రికి తీసిపోని కొడుకు జగన్

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పడుతున్న తపన తనను కదిలించిందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్‌జగన్‌ ప్రజల బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌లాగే ఆయన ప్రజల కోసం తపిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌లాగే జగన్‌ ఆలోచనలు ఉన్నాయన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్న తీరు హర్షణీయం అన్నారు. ఆయన లాంటి స్పూర్తి అందరికి రావాలని చెప్పారు. ప్రజలతో మమేకమై నవరత్నాలు ప్రకటించారని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్‌ బాగుంటుందన్నారు. వైఎస్‌ జగన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రానికి అవసరమని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు.