Politics

మోడీని ఓడించడమే మా అంతిమలక్ష్యం

మోడీని ఓడించడమే మా అంతిమలక్ష్యం

కేంద్రంలో భాజపాను ఓడించాలంటే కర్ణాటకలో మనమంతా కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదివారం పిలుపునిచ్చారు. కర్ణాటకలోని కొన్నిచోట్ల రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తరచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకరికి ఒకరం సహకరించుకుంటేనే విజయం సాధించగలమని నేతలకు దిశానిర్దేశం చేశారు. పేదలను పట్టించుకోకుండా, కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రమే లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్న మోదీని ఓడించడమే కూటమి అంతిమ లక్ష్యమని తెలిపారు.