ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వంటి గాంధేయవాదులు విజయం సాధించవలసిన అవసరం ఉందని ఆయన గెలుపు కోసం ప్రవాసాంధ్రులు గట్టిగా కృషి చేస్తున్నారని అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. సోమవారం నాడు అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్తో కలిసి కోమటి జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 600 మంది ప్రవాసాంధ్రులు తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారని ఎన్నారైలంతా చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని జయరాం తెలిపారు. అంతకు ముందు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అక్కడి తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్తో కలిసి కోమటి జయరాం ప్రచారం జరిపారు. రేపల్లె ప్రాంతం అభివృద్ధికి సత్యప్రసాద్ గట్టిగా కృషి చేశారని ఈ ఎన్నికల్లో ఆయన్ను తిరిగి గెలిపించాలని కోరుతూ జయరాం ప్రచారం జరిపారు. ఈ ప్రచారంలో ప్రవాస పారిశ్రామికవేత్త తాళ్ళూరి లక్ష్మణ్, ఎన్నారైలు చింతమనేని సుధీర్, పంతాని మురళీధర్, అనగాని శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డలో బుద్ధప్రసాద్ విజయం తథ్యం: కోమటి జయరాం
![Komati campaigns for mandali anagani Komati campaigns for mandali anagani](;https://i.imgur.com/YXyLY33.jpg)
Related tags :