Politics

నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి

modi-apologizes-dattatreya

హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. దత్తాత్రేయ స్పందిస్తూ ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి’ అని అన్నారు.