Politics

తెనాలిలో జనసేన కోసం ప్రచారం చేయనున్న చరణ్

charan to campaign in tenali for janasena

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవన్.. డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రానికి ఆయన కోలుకోవడంతో గుంటూరు జిల్లా తెనాలిలో ఈ రాత్రి నిర్వహించనున్న ప్రచార సభకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు సినీనటుడు రామ్‌చరణ్‌ కూడా పవన్‌కు మద్దతుగా రెండురోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో విజయవాడ చేరుకోనున్న చరణ్‌.. బాబాయ్‌తో కలిసి తెనాలి ప్రచార సభలో పాల్గొనే అవకాశముంది. మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్‌ కూడా ఇప్పటికే జనసేనకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.