Politics

ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎల్.వీ.సుబ్రహ్మణ్యం

lv subrahamanyam taken charge as ap cs

ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి సుబ్రహ్మణ్యం దంపతులకు తీర్థప్రసాదాలను అందజేశారు.