Politics

అవనిగడ్డ బరిలో మండలిదే విజయం

mandali victory in avanigadda

ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పునిచ్చే అవనిగడ్డ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించబోతున్నారు. తెలుగుదేశం, వైకాపా మధ్య పోటీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తెదేపా అభ్యర్ధి, డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ముందంజలో ఉన్నరు. కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు బరిలో ఉన్నారు. మరిసింహాద్రి రమే్‌శ బాబు వైసీపీ నుంచిశ్రీకాకుళాంధ్రుడు కొలువైయున్న అవనిగడ్డపై జెండా పాతేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దివిసీమగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో త్రిముఖపోటీ నెలకొంది. ఉపసభాపతిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైన మండలి బుద్ధప్రసాద్‌ టీడీపీ తరఫున…

**1962లో ఏర్పడిన అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో కాంగ్రెస్‌ ఏడు సార్లు, టీడీపీ ఆరు సార్లు గెలుపొందాయి. యార్లగడ్డ శివరామప్రసాద్‌, మండలి వెంకటకృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ, అంబటి బ్రాహ్మణయ్య, సైకం అర్జునరావు, సనకా బుచ్చికోటయ్యలాంటి ప్రముఖులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ ఇప్పటికి ఈ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన మండలి.. 2014లో టీడీపీలో చేరి వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్‌పై 5958 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి వీరిద్దరూ బరిలోకి దిగారు. వీరితోపాటు జనసేన నుంచి ముత్యంశెట్టి కృష్ణారావు కూడా బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో కాపుల సంఖ్య అధికంగా ఉండడంతో మూడు పార్టీలు అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపాయి. దీంతో పోరు హోరాహోరీగా మారింది. ఇప్పటికే మూడు పార్టీల అధ్యక్షులూ నియోజకవర్గంలో పర్యటించారు.
****మొత్తం ఓట్లు 2,00,677
కాపులు 69,876
మత్స్యకారులు 25,322
ఎస్సీ 36,608
గౌడ 19,100
కమ్మ 14,054
యాదవ 10,564
వైశ్య 4,500
రజక 3,600
ఇతరులు 17,053
***సింహాద్రి రమేశ్‌బాబు (వైసీపీ) బలాలు
రెండు పర్యాయాలు ఓటమి చెందడంతో సానుభూతి
పాత కమ్యూనిస్టులతో ఉన్న సత్సంబంధాలు
యువతను ఎక్కువగా ఆకర్షించటం.
*బలహీనతలు:
ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తులు
పార్టీకి అండగా ఉంటారనుకున్న
శివరావు రెబల్‌ అభ్యర్థిగా నిలబడడం
****మండలి బుద్ధప్రసాద్‌ (టీడీపీ) బలాలు
బలమైన టీడీపీ కేడర్‌
పట్టిసీమ ద్వారా సాగునీరు అందించటం
ఘంటసాలలో వ్యవసాయ
పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు
పార్టీలకతీతంగా సహాయమందించటం
*బలహీనతలు:
ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అనైక్యత
కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నారన్న ఆరోపణలు
*ముత్తంశెట్టి కృష్ణారావు (జనసేన) బలాలు
తెలుగుదేశంలోని ద్వితీయశ్రేణి నాయకులతో సంబంధాలు
నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన
ప్రజాసమస్యల పట్ల చేసిన పోరాటాలు
*బలహీనతలు
ఎన్నికల సమయంలోనే కనబడతారన్న ఆరోపణలు
స్థానికేతరుడు కావడం