Business

బీరుకాయల మీద భారీగా ఆదాయం దండుకున్న ఎక్సైజ్ శాఖ

heavy beer sales in andhra

రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరగడం ఎక్సైజు శాఖనే ఆశ్చర్యపరచింది. నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబరు, జనవరి నెలల కన్నా మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం. వేసవి కావడంతో చల్లదనం కోసం తాగుతున్నారు. అనుకున్నా.. గత విక్రయాల్లో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిల్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ రెండోది పార్లమెంటు ఎన్నికలు. మర్చి రెండో వారంలో ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కావడంతో బీర్ల కొనుగోళ్ళు ఊపందుకుంది. దీనికి తోడూ అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యుల్ విడుదలైంది. దీంతో అటు బార్ అండ్ రెస్టారెంటు, పబ్లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్ళలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్ది బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్ళుకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే కేసుల కొద్ది బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్ళకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం, ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సాధారణంగా ఎక్సైజు శాఖ విక్రయాల ప్రకారం ఐఎంఎల్ అంటే బ్రాందీ వైన్ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణా ఎక్సైజు శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున రూ. 1500 నుంచి రూ.1700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాల్ని బట్టి వీటిలో మద్యం, బీర్ల విక్రయాలు మారుతుంటాయి. గత 4నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే బీర్ల కేసులు పెరగడం గమనించవచ్చు.