Business

కాగితం సంచుల పేరుతో దోపిడీ…బాటాకు భారీ జరిమానా

bata fined 9000 for asking customer dinesh prasad to pay for paper bag worth 3 rupees

నిజానికి దినేష్ ప్రసాద్ గారిలా రోజువారి కొనుగోళ్లలో ఎంతో నష్టపోతుంటాడు వినియోగదారుడు. అన్యాయంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నించే టైము వాగ్యుద్దానికి దిగే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. పంజాబ్, చండీఘడ్ కు చెందిన దినేష్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్ ని పేపర్ బ్యాగులో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ. 3లు అని బిల్లులో వేశారు. దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాతా లోగో వేసిన ఉన్న బ్యాగు ఇస్తూ పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యం మీద రివర్సయ్యాడు. ఆ మూడు రూపాయలు నేనివ్వను. ఫ్రీగా ఇవ్వండి బ్యాగ్ అని అడిగాడు. దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో దినేష్ వెళ్లి వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం బాటాకు జరిమానా విధించింది. పేపర్ బ్యాగ్ కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్ ఉచితం ఇవ్వాలని పేర్కొంది. వ్యజ్యంకు రూ.వెయ్యి, మానసిక ఆందోళనకు రూ.మూడువేలు, లీగల్ ఎయిడ్ నిధికి రూ.ఐదువేలు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు చెల్లించమంటూ బాటాను ఆదేశించింది. ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్ అందజేయాలని ఆదేశించింది. చాలా స్టోర్లలో క్యారీ బ్యాగ్ పేరుతొ రూ.మూడు నుంచి రూ.ఐదులు వసూలు చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డంగా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతైనా ఆవసరం.