Movies

సమంతాను అరగంట కూడా చూడలేకపోయా

I couldnt watch samantha in that role says shraddha srinath

అగ్ర కథానాయిక సమంత నటించిన ‘యూ టర్న్’ చిత్రాన్ని చూడాలనిపించలేదని అంటున్నారు నటి శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. కన్నడలో తెరకెక్కిన ‘యూటర్న్‌’ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. మాతృకలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు. అయితే తాను మాత్రం సమంత నటించిన ‘యూ టర్న్‌’ సినిమాను చూడలేకపోయానని అంటున్నారు. ‘సమంత నటించిన ‘యూ టర్న్’ సినిమాను పూర్తిగా చూద్దామని ప్రయత్నించా. కానీ అరగంటకు మించి చూడలేకపోయా. ఎందుకంటే నా పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయాను. అవును.. నేను చాలా పొసెస్సివ్‌గా ఉంటాను’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంతో శ్రద్ధ మాటలపై సమంత అభిమానులు సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి చిత్రం ‘జెర్సీ’తో శ్రద్ధ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అలాంటప్పుడు తనకన్నా సీనియర్‌ నటులను గౌరవించాల్సిన ఇంగితజ్ఞానం కూడా లేదంటూ మండిపడుతున్నారు. ‘జెర్సీ’ చిత్రంలో శ్రద్ధ నానికి జోడీగా నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.