Politics

మోడీ గురించి నాకు బాగా తెలుసు

vijayshanthi claims nobody knows modi better than her

ప్రధానమంతి నరేంద్ర మోదీ వంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్‌లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను భాజపా నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యమేమిటో తెలుసు. ఓ ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవు. ఈ ఎన్నికలు రాహుల్‌గాంధీ- మోదీల మధ్య పోరు’ అంటూ వివరించారు. ఐదేళ్లలో మోదీ కేవలం అబద్ధాలతోనే దేశాన్ని మోసగించారని దుయ్యబట్టారు. భాజపా ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలకు సూచించారు. సేడంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలబురగి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఘనంగా సత్కరించారు.