DailyDose

అయేషా మీరా హత్య కేసును ఛేదిస్తున్న సీబీఐ-నేరవార్తలు-04/24

ayesha meera case cbi

Ø అయేషా మీరా హత్య కేసులో సిబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. నందిగామ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులను ఈ రోజు సిబీఐ విచారించింది
Ø శ్రీలంక పేలుళ్ళలో మృతుల సంఖ్య 300లకు పెరిగింది. నిర్లక్షంగా వ్యవహరించన కొలంబో పోలీస్ చీఫ్ తో పాటు రక్షణా కార్యదర్శులను రాజీనామా చేయాలని ఆ దెస అధ్యక్షుడు ఆదేశాలిచ్చారు
Ø తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఈ రోజు కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు
Ø జగన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
Ø భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయిపై వచ్చిన ఆరోపణలపై ఈ రోజు సుప్రీం కోర్టు లో విచారణ ప్రారంభామయ్యింది
Ø కొండచరియలు విరిగిపడి మయన్మార్ లో 50 మంది గాయపడ్డారు
Ø భువనగిరి జిల్లా నాగినేనిపల్లిలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మాహత్య చేసుకుంది
Ø కోయంబతూర్ లో ఒక బ్యాంకు ఎటీఎం లోకి ఒక పాము ప్రవేశించి కలకలం సృష్టించింది
Ø ధర్మవరం పట్టణంలో ఎలుకల రామకృష్ణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.