Movies

రష్మికను రమ్మంటున్నారు

bollywood entry confirmed for rashmika mandanna

వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన.. బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారట. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే ఓ చిత్రంలో రష్మిక నటించబోతున్నట్లు చిత్రవర్గాలు అంటున్నాయి. ఇందులో రణ్‌దీప్‌ హుడా కథానాయకుడిగా నటించనున్నారు. కథానాయికగా రష్మికను ఎంపికచేసుకోవాలని భన్సాలీ అభిప్రాయపడుతున్నారట. అయితే ఇంకా రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను బల్వీందర్‌ సింగ్‌ జాన్జువా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారు. ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మికకు.. ‘గీత గోవిందం’ చిత్రంతో బ్రేక్‌ లభించింది. ఆ తర్వాత ‘దేవదాసు’ చిత్రంతోనూ మెప్పించారు. ప్రస్తుతం ఆమె నితిన్‌, కార్తి, అల్లు అర్జున్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.