Business

“ఫణి” దెబ్బకు స్తంభించిన రవాణా

fani cyclone causes indian tranasportation go chaos

ఫొని తీవ్ర పెను తుపానుగా మారుతున్న నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా గో ఎయిర్‌ విమానయాన సంస్థ రేపు భువనేశ్వర్‌ నుంచి వెళ్లాల్సిన విమానాల రాకపోకలన్నింటినీ రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, ఇండిగో సంస్థ సైతం ఈరోజు విశాఖ నుంచి వెళ్లే 11 విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్టు వెల్లడించింది.మరోవైపు, తుపాను తీవ్రత నేపథ్యంలో వాల్తేరు డీఆర్‌ఎం శ్రీవాత్సవ శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. శ్రీకాకుళం మీదుగా విశాఖ వైపు వెళ్లే 74 రైళ్లను నేడు, రేపు రద్దుచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.