దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. తర్కించి విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మత రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఒక మతాన్ని వ్యతిరేకించడం లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. జాతిపితను గౌరవించుకోలేని పరిస్థితికి దేశం దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో తరతరాలుగా మత భేదం లేకుండా జీవనం కొనసాగుతోందన్నారు. ‘నాతో ఉంటే దేశ భక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి’ అన్న పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. నాథురామ్ గాడ్సే దేశభక్తుడంటూ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని తాను సోషల్ మీడియాలో ఖండించినట్టు ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ తనకు ట్విటర్లో కామెంట్ రావడం ఎంతో బాధ కలిగిందని కేటీఆర్ చెప్పారు.
గాంధీని గౌరవించలేని స్థాయికి దిగజారిపోతున్నాం
![KTR Expresses Disappointment On Not Respecting Gandhiji-గాంధీని గౌరవించలేని స్థాయికి దిగజారిపోతున్నాం KTR Expresses Disappointment On Not Respecting Gandhiji-గాంధీని గౌరవించలేని స్థాయికి దిగజారిపోతున్నాం](;https://4.bp.blogspot.com/-lvsGU2J1kBw/W74wlFUq_BI/AAAAAAAAFoY/1My-W0SUnAELyy6M-HZHb-EV7PEtDiAoACLcBGAs/s1600/speech1.jpeg)
Related tags :