విశాఖలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ,తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివగంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి గంటా శ్రీనివాసరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను మంత్రి కాదన్న గంటా శ్రీనివాసరావును కనీసం మనిషి గా కూడా గుర్తించను అని అన్నారు. అయ్యన్నపాత్రుడు గంటా కు చేయూత ఇచ్చి రాజకీయాల్లో కి తెస్తే ఆయనకే సున్నం పెట్టారని అన్నారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.అన్నం పెట్టిన వాళ్ళుకి గంటా సున్నం పెడతారని , ఆయన నిరంతర మంత్రి అని భ్రమ లొ ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ జోలికి వస్తే విశాఖలో ఉండకుండా చేసే శక్తి తమకి ఉందని, తాను నోరు తెరిస్తే గంటా బండారం బయట పడుద్ది అని అన్నారు.
గంటాకు అన్నం పెడితే మనకి సున్నం పెడతాడు
Related tags :