Politics

కొత్త అలవాట్లు నేర్పాలి

KCR To teach new habits to telangana farmers

మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు వ్యూహంపై మూడు రోజులు విస్తృతంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పత్తి నాణ్యతకు సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు.