Devotional

ఘనంగా ప్రారంభమైన మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాలు

మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో పవిత్రోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు శాస్త్రపరంగా జరగనున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలిరోజు గోపూజతో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి, ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే పవిత్రోత్సవాలు ఈ ఏడాది covid 19 కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి అతికొద్ది మంది భక్తుల నడుమ శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహణము, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, ఋత్విగ్వరణ, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్ఠానం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పములు. శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మధు తదితరులు పాల్గొన్నారు.