Devotional

వారణాశిలో ఉగ్రవారాహి ఆలయం

వారణాశిలో ఉగ్రవారాహి ఆలయం

వారణాసి భూగృహంలో ఉగ్రవారాహీ విచిత్ర దేవాలయం
మీరు కాశి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికివెళ్ళారా?వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి.
కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకుమాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాతమూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం!అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడిందిమొదలు ఉదయం 3:30 వరకుగ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి క్రింద చిత్రంలో చూపిన విధంగారెండు కన్నాల లో నుండి దర్శనం ఇస్తారు. ఒక కన్నం లో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం, రెండవ కన్నం లో నుండి చూస్తే పాదాలు దర్శనంఉంటుంది. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతిఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాల లో నుండిదర్శనానికి అనుమతి ఇస్తారు. మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి.క్రొత్తగాపెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈదేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితేవినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా! భక్తులనిచూడనివ్వదా! అంటే కాదునాయనా! శాంత కళ, ఉగ్రకళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనంచేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళ ని సామాన్యులుతట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను.సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నంఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లాపేల్లిపోతాయ్. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలుచూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేబియే వినకుండాచూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండిపట్టుపట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారిహారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు.ఈ మధ్య చాలామందిలో ఈమొండితనం ఎక్కువైంది. శాస్త్రాలు ఇలా చెప్పాయి అంటే అలా ఎందుకు చెప్పాలి? మేము కోర్ట్ కి వెళ్లి వ్యతిరేకంగా తెచ్చుకుంటాంఅంటున్నారు. దీనివలన ఎవరికీ నష్టం? మీతో పాటు మీవంశ నాశనం కూడ చేతులారా తెచ్చుకున్నట్లే.. మీవల్ల కేవలంమీవల్ల మీ వంశాలు తరతరాలు నాశనం అవుతున్నాయి. దుఃఖాల పాలై కష్టాల కడలిలోమునిగిపోతున్నారు. ఆనాడంటే జాతకాలు చూసి పూర్వికులు ఏమి చేయడం వలన ఏమి జరిగితుందోచెప్పేవారు. ఈనాడు అలాంటి జాతకాలు చూసి చెప్పేవారు లేరు. దీనివలన మూర్ఖత్వంఎక్కువై పైశాచికంగా మారిపోతున్నారు. సమాజం మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఇది మీకుకాని మీ వంశానికి కాని మంచిది కాదు.శాస్త్రం ఇలా చెప్పింది అంటే ఆలానే చేయాలి.ఎదురెళితే నష్టపోయేది మీరే మీ వంశంలోని వారే. దుష్టశక్తులను అంతం చేయాలంటే శాంతంగాఉంటే దుష్టశక్తులు ఊరుకుంటాయా?మీరుశాంతంగా ఉన్నారు కాబట్టి మేము శాంతంగా ఉంటాం అంటాయా? ఇంకా రెచ్చిపోతాయి.ఈ ఉగ్రవారాహి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల బెడదఉండదు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు మీమీద చేసినా వారికే బెడిసి కొడతాయి. కోర్ట్ కేసులుసమసిపోతాయి. అని శాస్త్రం..