భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని సినిమా నటుడు విశాల్ ఆదివారం కలిశారు. తన సోదరితో పాటు వెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్ పలు అంశాలను ఆయనతో చర్చించారు. సమాజ సేవ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు గురించి ఆయనతో మాట్లాడానని విశాల్ అన్నారు. వెంకయ్య నాయుడుతో విలువైన సమయం గడిపానని, ఆయనతో మాట్లాడటం ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయనకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని విశాల్ పంచున్నారు. వెంకయ్యనాయుడుతో కలిసి దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు.
వెంకయ్యనాయుడుతో విశాల్ సమావేశం
Related tags :