NRI-NRT

బాలికలకు తానా సాయం

బాలికలకు తానా సాయం

తానా ఫౌండేషన్ కార్యక్రమం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం నిర్వహించారు. 6వ తరగతిలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశం పొందిన 50 మంది బాలికలకు తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, ట్రస్టీ విశ్వనాధ్ రగ్గులు అందించారు. ఈ కార్యక్రమంలో బండి నాగేశ్వరరావు, ఉదయశ్రీ, రమాకుమారి తదితరులు పాల్గొన్నారు.