NRI-NRT

వీరవల్లిలో తానా సేవా కార్యక్రమాలు

Raja Kasukurthi Donates To Veeravalli Village In Bapulapadu Mandal

తానా కమ్యూనీటి సర్వీసెస్ కో ఆర్డినేటర్ కసుకుర్తి రాజా ఆధ్వర్యంలో వీరవల్లిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన తోడ్పాటును కార్యక్రమానికి హాజరయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అభినందించారు. బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్ లో 8లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్డుని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి పలువురు ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రారంభించారు. విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు, రైతులు స్పేయర్లు, కిట్లు, దుప్పట్లు అందజేశారు. ప్రధానోపాధ్యాయరాలు నిర్మల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నగేష్, జడ్పిటిసి గంగాభవానీ, సర్పంచ్ పిల్లా అనిత, పిఏసిఎస్ ఛైర్ పర్సన్ అల్లాడి ధెరిస్సా, పాఠశాల అభివృద్ది ఛైర్మ మద్ది రామమ్మ, వైస్ ఛైర్మన్ చందు రాజా, ఎంపీపీ చందురమాదేవి, ఎంపిటిసీలు దూసరి నిర్మల, అమృతపల్లి సూర్యానారాయణ, ఎంపిడో ప్రభాకారావు, ఏఈ జయరాజు, ఈవో శ్యామలరావు, ఉపసర్పంచ్ లంక అజేయ్ తదితరులు పాల్గొన్నారు.
Raja Kasukurthi Donates To Veeravalli Village In Bapulapadu Mandal