Politics

ఉగాదినాడు విశాఖకు జగన్ మకాం మార్పు??

ఉగాదినాడు విశాఖకు జగన్   మకాం  మార్పు??

ముహూర్తం ఖరారు.. ద్విముఖ వ్యూహం

విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఉగాది నాడు మార్చి 22 గృహ ప్రవేశం ముహూర్తంగా ఖరారు చేసినట్లు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచే సమీక్షలు పాలనా వ్యవహారాలు నిర్వహించనున్నారు. కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే రానున్న విద్యా సంవత్సరానికి ముందే సచివాలయం తరలింపుకు సంబంధించి ముందుగా భవనాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా సచివాలయం తరలింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. కోర్టు తుది తీర్పు ఆలస్యం అయితే, మార్చి 22 నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి తన కార్యకలాపాలు ప్రారంభించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ కేంద్రంగా జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ సన్నాహక సదస్సులో విశాఖే ఏపీ రాజధాని అని.. తాను త్వరలో విశాఖకు మారుతున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.