ఝార్ఖండ్లోని గిరిడీహ్ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. నాలుగు రోజుల వయసున్న నవ జాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయింది. ఆ శిశువు తాతతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేయడా నికి అయిదుగురు పోలీసులు బుధవారం తెల్లవారుజా మున వారి ఇంటికి వెళ్లారని, పెనుగులాటలో శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో స్టేషన్ ఇంఛార్జి సహా మొత్తం ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేసి వారిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘట నపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
పోలీసు బూట్ల కింద నలిగి నవజాత శిశువు మృతి
![పోలీసు బూట్ల కింద నలిగి నవజాత శిశువు మృతి పోలీసు బూట్ల కింద నలిగి నవజాత శిశువు మృతి](https://i.postimg.cc/R0KLrTX6/Whats-App-Image-2023-03-24-at-9-26-51-AM.jpg)