Devotional

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త

తిరుమల :

మే, జూన్‌ నెలల రూ.300 దర్శనం టికెట్లు ఒకేసారి విడుదల.. అద్దె గదులు కూడా..!

తిరుమలకు వెళ్లాలనుకుంటున్న శ్రీవారి భక్తులకు శుభవార్త.

మే, జూన్ నెలలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేయనున్నారు.

మే, జూన్ నెలలకు సంబధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఈ tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా tt devasthanams యాప్‌లో మీ వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మే, జూన్ నెలలకు సంబంధించి తిరుమలలో అకామడేషన్ కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఇవి కూడా తిరుపతి అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఎంత త్వరగా ప్రయత్నిస్తే.. అంత ఈజీగా దొరుకుతాయి.