WorldWonders

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం: మోదీ పేరుపై తొలి పూజ

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం: మోదీ పేరుపై తొలి పూజ

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేలమంది భక్తులు తరలిరాగా..హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం శివ నామస్మరణ హోరు మధ్య మంగళవారం తెరుచుకుంది.

కేదార్నాథ్: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేలమంది భక్తులు తరలిరాగా.. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం శివ నామస్మరణ | హోరు మధ్య మంగళవారం తెరుచుకుంది. ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా ఉండి.. మంచు కమ్మేసినా భక్తులు కేదార్నాథ్ చేరుకున్నారు. వారి ప్రార్ధనలు, భజనల మధ్య ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు తెరిచారు. కేదారేశ్వరుడిని దర్శించుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. ప్రధాని మోదీ పేరిట తొలి పూజ నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలయాన్ని చేరుకోవడం సవాలుగా మారిందని ధామీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారి ప్రయాణం సులువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయాన్ని తెరిచే సమయంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.