NRI-NRT

TANA. కాశీలో అన్నదాన శిబిరాన్ని సందర్శించిన ఎంపీ జీవీఎల్..

TANA. కాశీలో అన్నదాన శిబిరాన్ని సందర్శించిన ఎంపీ జీవీఎల్..

గంగా పుష్కరాల సందర్భంగా వారణాసిలో తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన వితరణ కార్యక్రమానికి యాత్రికుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. శనివారం పుష్కరాలు ఎనిమిదవ రోజు దాదాపు 1000 మందికి అన్నదానం చేశారు. భాజపా ఎంపీ కాశీ తెలుగు సమితి గౌరవ అధ్యక్షులు జీవీఎల్ నరసింహారావు తానా అన్నదాన శిబిరాన్ని శనివారం నాడు సందర్శించి అన్నదానాన్ని స్వీకరించారు. చక్కటి భోజనాన్ని అందిస్తున్నందుకు తానా నిర్వాహకులను విరాళాలు అందించిన సభ్యులను ప్రశంసించారు.