తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టెందుకు ప్రపంచ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. సకల సౌకర్యలు కలిగిన హైదరాబాద్లో పెట్టుబడి పెడితె తమ కంపేనీలకు తమకు లాభదాయకం అని ఇన్వ్స్టర్ లు బావిస్తున్నారట. తాజగా, రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు స్వీడన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి అప్లికేషన్లు వస్తున్నాయని స్వీడిష్ ట్రేడ్ కమిషన్ నిన్న(గురువారం) ప్రకటించింది. స్వీడన్ ఎంబసీతో పాటు, మెడికవర్ హాస్పిటల్స్తో కలిసి ఈ సంస్థ ఇంటరాక్ట్ అయ్యింది.
హెల్త్కేర్, ఫార్మా, ఆటోమొబైల్స్, ఐటీ, టెక్ వంటి సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసేందుకు స్వీడన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని స్వీడన్ ట్రేడ్ కమిషనర్ సెసిలియా ఓస్కర్సన్ తెలిపారు. ఇండియా మొత్తం మీద 260 కంపెనీలు, ఒక్క తెలంగాణలోనే 45 స్వీడన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
13 స్వీడన్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్వీడిష్ ట్రేడ్ కమిషన్ బుధవారం మంత్రి కేటీఆర్తో సమావేశమయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు గల అవకాశాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికవర్, ఐకియా వంటి స్వీడన్ కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి.