Editorials

నేడు అన్నమాచార్య జయంతి

నేడు  అన్నమాచార్య జయంతి

🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

🌸వ్యక్తిత్వ వికాస ప్రకాశకుడిలా అన్నమయ్య

🌿తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకుని తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి నేడు.

🌸ఆయన పూర్తి పేరు తాళ్ళపాక అన్నమాచార్యులు.

🌿ఆయన రాసిన సంకీర్తనలు, సాహితీ చరిత్ర ఆధారంగా లభించిన వివరాల ప్రకారం అన్నమయ్య 1408 వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమా నాడు జన్మించాడు.

🌸కడప జిల్లా ప్రస్తుత రాజంపేట నియోజకవర్గం తాళ్ళపాక గ్రామంలో నివసించే నారాయణసూరి,

🌿 లక్కమాంబ దంపతులకు జన్మించిన వరప్రసాదంగా అన్నమయ్యను అభివర్ణిస్తారు.

🌸32 వేలకు పైగా సంకీర్తనలు వ్రాసి తెలుగు భాషలోని మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం వంటి

🌿నవరసాలను తన పాటలలో, పద్యాలలో పొందుపరచిన గొప్ప పదకవితా పితామహుడాయన.

🌸ఆయన రాసిన 32 వేలకు పైచిలుకు సంకీర్తనలలో చాలావరకూ అందుబాటులో లేవు.

🌿కేవలం 15 వేల సంకీర్తనలు మాత్రమే మిగిలాయి. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో రచనల్లో ఎక్కువగా కడప, రాయలసీమ యాసే తాండవించేది.

🌸అన్నమయ్య భక్తుడే కాదు.. చైతన్యపరుడు కూడా,..

🌿అన్నమాచార్యులను అంతా వైష్ణవ భక్తుడిగానే చూశారు. వేంకటేశ్వర స్వామిపై ఆయన రాసిన సంకీర్తనలే అందుకు కారణం.

🌸కానీ, ఆయన వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించిన ఓ గొప్ప గురువు.

🌿ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో, ఒక మనిషి ఎలా మెలగాలో చాటి చెప్తూ ఆయన రాసిన కీర్తనలు,

🌸రచనలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసానికి సరియైన మార్గదర్శి.

🌿అంతెందుకు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే…”అంటూ ఆయన రాసిన గొప్ప సంకీర్తన అర్ధం మనుషులంతా సమానమేనని’ చెప్పే ప్రయత్నం.

🌸ఇందులో సామాజిక కోణం దాగి ఉంది. ఊరూరా తిరుగుతూ ఆయన చేసిన కవితలలో జీవన అర్థం, సామాజిక పరమార్థం దాగి ఉన్నాయి.

🌿“మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!”

🌸అంటూ అన్నమయ్య రాసిన సంకీర్తన నేటికీ ప్రతి మనిషిలోనూ ఓ కొత్త ఉత్తేజం నింపుతుంది.

🌿ఈ కీర్తన ద్వారా “ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి” అని చెప్పుకొచ్చాడు అన్నమయ్య.

🌸 “ఉద్యోగి”అంటే “ఉద్యోగం చేసేవాడు” అని అర్ధం కాదు. ఆయన భావంలో “ఉద్యోగి”అంటే “ఉద్యమించే వాడు” అని అర్థం. కార్యసిద్ది కోసం ప్రయత్నించేవాడు,

🌿ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోకుండా పాటుపడే వాడు అని అర్ధం.

🌸“వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!”

🌿అన్నమయ్య చేతి నుండి జాలు వారిన ఈ శ్లోకం భావం –

🌸“శ్రద్ధతో చేస్తేనే కార్యాలు పూర్తవుతాయని, మొక్కుబడిగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదని..”

🌿శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు”అంటున్నాడు అన్నమయ్య.

🌸తపస్సు సాధించాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు”
అని పలికాడు అన్నమయ్య.

🌿అనాడే చదువు విలువ ఏమిటో, మనిషిలో ఎంతటి మార్పును తీసుకు వస్తుందో తన పదకవితలతో చక్కగా చెప్పాడు అన్నమయ్య.

🌸మరి అన్నమయ్య చెప్పేది నిజమేగా మొక్కుబడిగా చదివితే ఏం ప్రయోజనం? శ్రద్దగా చదివితేనే జ్ఞాన గుణ సంపన్నులం కాగలం.

🌿ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో కష్టనష్టాలకు క్రుంగిపోకూడదు అని అన్నమయ్య ఆనాడే వ్యక్తి వికాసానికి దోహదం చేసే ఎన్నో సంకీర్తనలు వ్రాశాడు.

🌸అన్నమయ్య రాసిన సంకీర్తనలలో ఎక్కువ శృంగారం గురించే ఉండటం విశేషం.

🌿అంటే ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడిగానే కాకుండా.., ఒక మనిషి జీవితంలో వచ్చే నవరసాల భావో ద్వేగాలను కూడా తన రచనలలో ఆనాడే పరిచయం చేశాడు.

🌸అన్నమయ్య కీర్తనలను వెంకటేశ్వరస్వామి ముద్రతో రచించి ఆ స్వామికే అంకితంచేసిన ధన్యజీవి!

🌿 అందుకే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే అన్నమయ్యను స్మరించినట్లే. అన్నమయ్యను స్మరిస్తే స్వామిని స్మరించినట్లే!

🌸తరాలు మారినా.. యుగాలు మారినా.. వేంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం అన్నమయ్య స్థానం పదిలం