Politics

రుషికొండ తవ్వకాల పిటిషన్లపై హైకోర్టు విచారణ

రుషికొండ తవ్వకాల పిటిషన్లపై హైకోర్టు విచారణ

వెలగపూడి: విశాఖపట్నంలోని రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ గతంలో జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్‌, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేసిన పిటిషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపింది. విచారణలో భాగంగా వాదోపవాదాలు విన్న ధర్మాసనం విచారణను మరోసారి వాయిదా వేసింది.

డిపాజిటర్ల చట్టం కింద కేసు ఎలా నమోదు చేస్తారు?.. సీఐడీని ప్రశ్నించిన హైకోర్టు

సొమ్ములు తిరిగి చెల్లించడంపై ఏ ఒక్క డిపాజిటర్‌కు అభ్యంతరం లేనప్పుడు జగజ్జనని కేసులో డిపాజిటర్ల చట్టం’ఎలా వర్తిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్ట ప్రకారం ఆ సంస్థపై కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీసింది.

కొవ్వలి చెరువును పూర్వ స్థితికి తీసుకురావాలి : కలెక్టర్​కు హైకోర్టు ఆదేశాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వలి చెరువును ఆక్రమణ నుంచి రక్షించే దిశగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆక్రమణలు తొలగించి చెరువును పూర్తి స్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది.