Politics

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం

ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ

హైదరాబాద్ : అమరవీరుల ఆశయాలు నెరవేరాలనే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఏ ఆకాంక్షల కోసం ఉద్యమం చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదని ఆరోపించారు. ఇంటికో జాబ్‌ ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేశారని విమర్శించారు. తెలంగాణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.