DailyDose

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఫాస్ట్ రైళ్లుకు గ్రీన్ సిగ్నల్….

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఫాస్ట్ రైళ్లుకు  గ్రీన్ సిగ్నల్….

తెలుగు రాష్ట్రాల్లో కీలక రైల్వే ప్రాజెక్టులకు బీజం పడింది. ప్రతిపాదిత శంషాబాద్‌- విజయవాడ- విశాఖపట్నం, కర్నూలు- విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల కోసం పెట్‌ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌) సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు తాజాగా అనుమతిచ్చింది. ఇవి కార్యరూపం దాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని వివరించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రధాన రూట్లలో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-150 కిలోమీటర్లు ఉండగా శంషాబాద్-విజయవాడ, కర్నూలు-విజయవాడ మధ్య గంటకు 220 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైళ్లను నడిపాలని రైల్వే శాఖ యోచనగా ఉంది. ఇందుకోసం నూతన లైన్లను నిర్మించాలని తలపోస్తోంది. ఈ క్రమంలో రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందేభారత్ రైళ్లను నడిపేందుకు కూడా రైల్వే శాఖ రెడీ అవుతోంది.