Politics

బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్…..

బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై  ఫోకస్…..

జూన్ నెలలోనే బీజేపీ ముగ్గురు అగ్రనేతలు తెలంగాణ  రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఒక్కో సభకు ఒక్కో అగ్రనేత ముఖ్యఅతిథిగా పాల్గొనేలా మూడు భారీ బహిరంగసభల నిర్వహణకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న సంకేతాలను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా వ్యూహం రచించింది.

తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. వరుస పర్యటనలకు బీజేపీ అగ్ర నేతలు క్యూ కడుతున్నారు. ఈనెల 15న అమిత్ షా, 25న జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈనెల 15న ఖమ్మం పార్లమెంట్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరుకానున్నారు. 25న నాగర్ కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొనన్నారు. ఈనలె 30లోపు హైదరాబాద్ మల్కాజిగిరిలో మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో నల్గొండలో బీజేపీ బహిరంగ సభ జరుపనుంది. సభలో మోడీ పాల్గొననున్నారు.