Politics

రాయలసీమ జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

రాయలసీమ జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

టిడిపి అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం టెక్స్టైల్ కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు.బాబు ష్యురిటీ, భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుత్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కాగా, బావమరిదిలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా ? అంటూ ఏపీ మంత్రి రోజా ట్వీట్ చేసారు.

రూ. 118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులపై మంత్రి రోజా ట్విట్టర్ లో స్పందించారు. ‘ఈ కేసులో ధైర్యంగా ఆయన విచారణ ఎదుర్కొంటారా? లేక బావమరిదిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? రామోజీల మంచం ఎక్కుతారా? అచ్చన్నల రమేష్ ఆసుపత్రిలో చేరతారా? విజయ్ మల్యాల విదేశాలకు పారిపోతారా? ఇవన్నీ కాకుండా ఇప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.